
రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

భార్య, భర్తలుగా తనకు, చరణ్కు మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడింది.

ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు సమయం కేటాయించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

పెళ్లయిన కొత్తలోనే రామ్చరణ్, నేను ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నామని.. తను నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తాడని తెలిపింది.

వారానికి ఒకసారైనా డేట్ నైట్కు వెళ్లమని అమ్మ చెప్తూ ఉండేదని ఉపాసన తెలిపింది.

కానీ మేము వారంలో ఒకరోజు టీవీ, ఫోన్లకు దూరంగా ఉంటామని.. మా మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాని వెల్లడించింది.

మాట్లాడుకుంటేనే కదా ఏదైనా తెలిసేది, పరిష్కరించుకోగలిగేది.. పెళ్లిళ్లు వర్కవుట్ కావాలంటే ఇవన్నీ చేస్తుండాలని వివరించింది.

ఎప్పటికప్పుడు రిలేషన్ను బలపర్చుకుంటూ ఉండాలని.. మావల్ల కాదని వదిలేస్తే కష్టమని ఉపాసన అంటోంది.







