టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) విజయవాడలో పర్యటించారు
విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ ప్రాంగణంలో మదర్స్ మిల్క్ బ్యాంక్ ను ఆమె ప్రారంభించారు
ఈ మిల్క్ బ్యాంకు ప్రాజెక్టుకు రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ నిధులు సమకూర్చింది
నమ్రత మాట్లాడుతూ, అనేక సందర్భాల్లో శిశువులకు తల్లి పాలు అందక ఇబ్బందులు ఎదురవుతుంటాయని, అలాంటి వారికి ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు


