సైకిల్‌ దొరికింది..  స్వాతి మురిసింది!  | prajavani programme handicapped child got tricycle | Sakshi
Sakshi News home page

 సైకిల్‌ దొరికింది..  స్వాతి మురిసింది! 

Feb 13 2018 2:53 PM | Updated on Feb 13 2018 2:53 PM

prajavani programme handicapped child got tricycle - Sakshi

ప్రజావాణికి వచ్చిన స్వాతి, ఆమె తల్లి

పాన్‌గల్‌ మండలం మల్లాయపల్లికి చెందిన 11ఏళ్ల స్వాతి పుట్టుకతోనే దివ్యాంగురాలు. అమ్మానాన్నలు నిరుపేద కూలీలు.. తల్లి తోడు లేనిదే బయటికి రాలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా అమ్మ చంకనెక్కాల్సిందే..! బిడ్డకు ట్రైసైకిల్‌ మంజూరు చేయాలని ఆమె తల్లి సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో డీఆర్వో చంద్రయ్యకు విన్నవించింది. ఆయన ఆదేశాల మేరకు డీడబ్ల్యూఓ వరప్రసాద్‌ ఆమెకు అరగంటలోనే ట్రై సైకిల్‌ను సమకూర్చారు. జేసీ నిరంజన్, డీఆర్వో చంద్రయ్య తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా స్వాతికి  మోములో చిరునవ్వు వెల్లివిరిసింది.                    

– ఎం.యాదిరెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, వనపర్తి 

1
1/2

ట్రైసైకిల్‌ పంపిణీ చేస్తున్న జిల్లా అధికారులు

2
2/2

సైకిల్‌పై ఆనందంలో స్వాతి

Advertisement
 
Advertisement
Advertisement