క్వారీలో ప్రమాదం..ఇద్దరి మృతి

విజయనగరం : బొబ్బిలి మండలం బంకురువలస మాంగనీస్‌ క్వారీలో మంగళవారం ప్రమాదం జరిగింది. క్వారీలో బండరాళ్లు మీద పడి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top