నేడు రాష్ట్రపతితో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan mohan reddy to meet President along with YSRCP MPs on defected MLAs issues | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్రపతితో వైఎస్‌ జగన్‌ భేటీ

Published Thu, Apr 6 2017 1:21 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

నేడు రాష్ట్రపతితో వైఎస్‌ జగన్‌ భేటీ - Sakshi

నేడు రాష్ట్రపతితో వైఎస్‌ జగన్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా..

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడాన్ని ప్రణబ్‌ దృష్టికి తీసుకెళ్లనున్న వైఎస్సార్‌సీపీ బృందం

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీన భారత రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీతో భేటీ కానున్నారు.

గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమవుతుంది. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని చంద్రబాబు ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతికి ఈ సందర్భంగా జగన్‌ వివరిస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement