తీవ్రవాదానికి మతం లేదు: అజీజ్ ఖురేషీ | Terrorism has no religion, says Aziz Qureshi | Sakshi
Sakshi News home page

తీవ్రవాదానికి మతం లేదు: అజీజ్ ఖురేషీ

Oct 30 2014 6:20 PM | Updated on Sep 2 2017 3:37 PM

తీవ్రవాదానికి మతం లేదని ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ అన్నారు.

సంభాల్(యూపీ): తీవ్రవాదానికి మతం లేదని ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ అన్నారు. తీవ్రవాద హింసను తుదముట్టించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కల్కి మహోత్సవంలో గురువారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మనదేశంలో తీవ్రవాదులు అడుగుపెట్టకుండా చూడాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంపై ఆయన ప్రశంసలు కురిపించారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ పూనిక వహించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement