యూఏఈలో భారత రాయబారిగా టీ పీ సీతారాం | T.P. Seetharam appointed as the next Ambassador of India to the United Arab Emirates | Sakshi
Sakshi News home page

యూఏఈలో భారత రాయబారిగా టీ పీ సీతారాం

Nov 12 2013 11:51 AM | Updated on Sep 2 2017 12:33 AM

యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారత రాయబారిగా టీ పీ సీతారం నియమితులయ్యారు.

యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారత రాయబారిగా టీ పీ సీతారం నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది.  సీతారాం ప్రస్తుతం మారిషస్లో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

 

1980 బ్యాచ్ ఇండియన్ ఫారన్ సర్వీస్ అధికారి అయిన సీతారం ఇప్పటి వరకు పలు దేశాల్లో భారత రాయబారిగా పని చేశారు. అయితే సీతారాం త్వరలో యూఏఈలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement