వెల్లోకి వెళ్తే సస్పెండ్ చేయాల్సిందే: దిగ్విజయ్ | Sakshi
Sakshi News home page

వెల్లోకి వెళ్తే సస్పెండ్ చేయాల్సిందే: దిగ్విజయ్

Published Thu, Feb 13 2014 3:16 PM

వెల్లోకి వెళ్తే సస్పెండ్ చేయాల్సిందే: దిగ్విజయ్ - Sakshi

సభలో ఎవరైనా సభ్యులు వెల్లోకి దూసుకెళ్తే వాళ్లను సస్పెండ్ చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఓ నిబంధన ఉందిగానీ, దాన్ని సరిగా ఇంతవరకు అమలు చేయలేదని ఆయన చెప్పారు.

అనవసర నిరసనల కారణంగా చాలా ముఖ్యమైన బిల్లులు పెండింగులో ఉండిపోతున్నాయని, ప్రజలకు రాజకీయాలంటే నమ్మకం లేకుండా పోతోందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.

Advertisement
Advertisement