రేపే బిహార్లో మొదటి దశ ఎన్నికలు | Stage set for first phase of Bihar elections on Monday, 49 seats to go to polls | Sakshi
Sakshi News home page

రేపే బిహార్లో మొదటి దశ ఎన్నికలు

Oct 11 2015 1:27 PM | Updated on Jul 18 2019 2:17 PM

రేపే బిహార్లో మొదటి దశ ఎన్నికలు - Sakshi

రేపే బిహార్లో మొదటి దశ ఎన్నికలు

బీహార్ శాసనసభకు మొదటి దశ పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది.

పాట్నా : బీహార్ శాసనసభకు మొదటి దశ పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. ఈ దశలో మొత్తం 10 జిల్లాల్లో 49 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 583 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ని ప్రారంభం అవుతుందని అడిషనల్ చీఫ్ ఎలక్ట్రోలర్ అఫీసర్ ఆర్ లక్ష్మణన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 1, 35, 72, 339 మంది ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారని చెప్పారు.

అయితే అత్యధిక ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉందని... ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ప్రదేశాల్లో సాయంత్రం 3.00 గంటలు, మరికొన్ని చోట్ల సాయంత్రం 4.00 గంటలకు పోలింగ్ ముగియనుందని చెప్పారు. మొదటి దశలో మొత్తం 54 మంది మహిళ అభ్యర్థులు బరిలో నిలిచారని లక్ష్మణ్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement