సర్ఫరాజ్‌ అహ్మద్‌కు మరో ప్రమోషన్‌! | Sarfraz Ahmed named Pakistan Test captain | Sakshi
Sakshi News home page

సర్ఫరాజ్‌ అహ్మద్‌కు మరో ప్రమోషన్‌!

Jul 5 2017 12:22 PM | Updated on Sep 5 2017 3:17 PM

సర్ఫరాజ్‌ అహ్మద్‌కు మరో ప్రమోషన్‌!

సర్ఫరాజ్‌ అహ్మద్‌కు మరో ప్రమోషన్‌!

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని దేశానికి అందించిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ప్రమోషన్‌ దక్కింది.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని దేశానికి అందించిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ప్రమోషన్‌ దక్కింది. పాక్‌ జట్టు టెస్టు సారథ్య బాధ్యతలు కూడా అతనికి అప్పగిస్తున్నట్టు  ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఇటీవల సీనియర్‌ క్రికెటర్‌ మిస్బావుల్‌ హక్‌ రిటైరవ్వడం.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని అనూహ్యరీతిలో పాక్‌ గెలుపొందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

చాంపియన్స్‌ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌ చేతిలో చిత్తయిన పాకిస్థాన్‌ అనూహ్యంగా పుంజుకొని ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో బలమైన భారత జట్టును 124 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయాల క్రెడిట్‌ సర్ఫరాజ్‌ సారథ్యానికే దక్కింది. అతని నాయకత్వంలో పాక్‌ జట్టు సమష్టిగా ఆడుతూ వరుసగా విజయాల బాట పట్టింది. సర్ఫరాజ్‌ ఇంతవరకు టెస్టులకు నాయకత్వం వహించలేదు. అయినా, అతని నాయకత్వంలో వన్డేలు, టీ-20లలో పాక్‌ వరుసగా విజయాలు సాధించడంతో అతనికే టెస్టు పగ్గాలు దక్కాయి. సర్ఫరాజ్‌ సారథ్యంలో పాక్ జట్టు ఏడు వన్డేల్లో విజయం సాధించింది. టీ-20లలో అతని కెప్టెన్సీలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏడింటిలో గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement