రియో ఒలింపిక్స్లో పీవీ సింధు అసమాన పోరాటం దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన ఆమె ఫైనల్ మ్యాచ్.. దేశ ప్రజలను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది.
ప్రపంచ నంబర్, స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్తో సింధు తలపడిన రియో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ను ఏకంగా భారత్లో 6.65 కోట్లమంది చూశారు. భారత్ పరంగా చూసుకుంటే రియో ఒలింపిక్స్లో అత్యధికులు చూసిన సింగిల్ మ్యాచ్ ఇదే. అంతేకాదు దేశంలో అత్యంత పాపులర్ అయిన 'ద కపిల్ శర్మ షో' వంటివాటిని సింధు ఫైనల్ మ్యాచ్ అధిగమించడం విశేషం. 'ద కపిల్ శర్మ షో'ను ప్రతివారం ఐదు కోట్ల మంది వీక్షిస్తుండగా సింధు ఫైనల్ మ్యాచ్ను ఏకంగా 6.65 కోట్లమంది వీక్షించారని మీడియా రీసెర్చ్ సంస్థ జపర్ తెలిపింది.
రియో ఒలింపిక్స్లో సింధు ఆడుతున్న మ్యాచ్లకు క్రమంగా వ్యూయర్షిప్ పెరిగింది. మొదట ఆమె మ్యాచ్లకు 16.4 మిలియన్ల వ్యూయర్షిప్ ఉండగా.. ఫైనల్ మ్యాచ్కు వచ్చేసరికి అది అమాంతం పెరిగిపోయింది. ఇక, ఆమె సెమీఫైనల్ మ్యాచ్ను లైవ్లో చూసిన ప్రేక్షకుల్లో 57.4శాతం మంది ఫైనల్ మ్యాచ్ను కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. సింధు ప్రతిభ మీద ఉన్న అపారమైన నమ్మకమే ఆమె ఫైనల్ మ్యాచ్ను లైవ్లో చూసేందుకు చాలామందిని ప్రోత్సహించినట్టు నిపుణులు చెప్తున్నారు.
హైదరాబాద్లో రికార్డు వ్యూయర్షిప్
పీవీ సింధుకు స్వస్థలం హైదరాబాద్ నుంచి భారీ మద్దతు లభించినట్టు టీవీ వ్యూయర్షిప్ స్పష్టం చేస్తున్నది. దేశంలో ముంబై తర్వాత అత్యధికంగా సింధు మ్యాచ్ను చూసింది హైదరాబాదీలే. నగరాల వ్యూయర్షిప్ విషయంలో ముంబై ప్రథమస్థానంలో ఉంటే హైదరాబాద్ ద్వితీయ స్థానంలో ఉంది. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వివరాల ప్రకారం రెండువారాలపాటు జరిగిన రియో ఒలింపిక్స్ను దేశంలో తొమ్మిది చానెళ్లలో 22.8 కోట్లమంది వీక్షించారు.
సింధు మ్యాచ్.. సెన్సేషనల్ హిట్!
Published Tue, Aug 30 2016 3:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
What’s your opinion
Advertisement