* ఒక్కసారి పిలిస్తే చాలు.. జీవితాంతం తోడుంటాను
* మోదీ భార్య జశోదాబెన్ ఆకాంక్ష
ముంబై/అహ్మదాబాద్: ‘ఆయనతో కలిసుండాలనే నాకుంది. తనతో కొత్త జీవితం ప్రారంభించాలని ఉంది. నాకు ఆ ఆశ ఎప్పట్నుంచో ఉంది. తనకు సేవ చేయాలని ఉంది. ఒక్కసారి రమ్మని పిలిస్తే చాలు.. సంతోషంగా వెంట వెళ్తాను. నేనుంటు న్న ఇంటి దగ్గరికి వచ్చి తనతో రమ్మని ఒక్కసారి ఆహ్వానిస్తే.. మరుక్షణమే ఆయన తోడుగా వెళ్తాను. జీవితాంతం తోడుంటాను. కానీ ముందు ఆయన నన్ను పిలవాలిగా!’ ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదా బెన్(64) ఆకాంక్ష ఇది. 43 ఏళ్లుగా విడిగా ఉంటున్నా.. భర్తపై మమకారం తగ్గలేదని, తన పూజలన్నీ ఆయన కోసమేనని జశోదాబెన్ చెబుతున్నా రు. ఇప్పటికీ వారంలో 4రోజులు ఆమె ఉపవాసం ఉంటారు.
విడిపోయి 43 ఏళ్లు
1968లో మోదీకి 17 ఏళ్ల వయసులో జశోదాతో వివాహమయింది. మూడేళ్ల తరువాత వారిద్దరూ విడిపోయారు. తండ్రి సహకారంతో చదువుకుని గుజరాత్లోని వాద్గం జిల్లా, రాజోషన గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా జశోదాబెన్ కొత్త జీవితం ప్రారంభించారు. వారిద్దరూ విడిపోయి దాదాపు 43 ఏళ్లు. ఇటీవలి లోక్సభ ఎన్నికల వరకు తన వివాహం గురించి కానీ, భార్య గురించి కానీ మోదీ ఎక్కడా బహిరంగంగా ప్రస్తావించలేదు.
వడోదర స్థానం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న సందర్భంగా.. ఎన్నికల అఫిడవిట్లో తన భార్య పేరు జశోదాబెన్ అని తొలిసారి వెల్లడించారు. అఫిడవిట్లో భార్యగా తన పేరును మోదీ రాశారని తెలిసినప్పుడు తన భావాలను మిడ్డే పత్రికతో ఆమె పంచుకున్నారు. ‘చాలా సంతోషమయింది. నా కళ్లల్లో నీళ్లొచ్చేశాయి. నాకు తెలుసు. ఆయనకు నేనంటే ఇష్టమే. తన హృదయంలో నాపై ప్రేమ ఉంది. అందుకే ఆయన నా పేరు రాశారు’ అన్నారు.
నేను ఆటోలో.. సెక్యూరిటీ వారు వెనక కార్లో..!
మోదీ ప్రధాని అయిన తరువాత తనకు ఏర్పాటు చేసిన భద్రత తనకు ఇబ్బందిగా మారిందని జశోదాబెన్ చెప్పారు. మే 30 నుంచి గుజరాత్ పోలీస్కు చెందిన ఐదుగురు అధికారులు ఆమెకు ఎస్కార్ట్గా వస్తున్నారు. జశోదాబెన్ ఆటోలో వెళ్తుంటే.. వారు వెనక కార్లో ఫాలో చేస్తుంటారు. ‘ఎక్కడికెళ్లినా వస్తున్నారు. చిరాగ్గా ఉంది’ అని ఆమె విసుక్కున్నారు.
ఆర్టీఐకి దరఖాస్తు
ప్రభుత్వం తనకు కల్పిస్తున్న భద్రత వివరాలను తెలపాల్సిందిగా జశోదాబెన్ సోమవారం సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘నేను ప్రధానమంత్రి భార్యను. ప్రొటోకాల్ ప్రకారం నాకందిస్తున్న సెక్యూరిటీ వివరాలను తెలపండి’ అని ఆమె కోరారు. ‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సెక్యూరిటీ గార్డులే చంపేశారు. నాకిస్తున్న సెక్యూరిటీ విషయంలో నేను భయపడ్తున్నాను. నాకు సెక్యూరటీగా వస్తున్నవారి పూర్తి వివరాలు నాక్కావాలి’ అని ఆమె అందులో అభ్యర్థించారు.
ఆయనతో కలిసుండాలని ఉంది!
Published Tue, Nov 25 2014 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement