ఆ గుడి ప్రాంగణంపై చాపర్ల చక్కర్లు వద్దు! | Odisha for not allowing helicopters during Nabakalebara | Sakshi
Sakshi News home page

ఆ గుడి ప్రాంగణంపై చాపర్ల చక్కర్లు వద్దు!

Jun 10 2015 5:17 PM | Updated on Sep 3 2017 3:31 AM

ఆ గుడి ప్రాంగణంపై చాపర్ల చక్కర్లు వద్దు!

ఆ గుడి ప్రాంగణంపై చాపర్ల చక్కర్లు వద్దు!

ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాధ్ ఆలయంపై భాగం మీదుగా హెలికాప్టర్లు, విమానాలు ప్రయాణించేందుకు అనుమతించొద్దని కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర సర్కారు లేఖ రాసింది

భువనేశ్వర్: ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాధ్ ఆలయంపై భాగం మీదుగా హెలికాప్టర్లు, విమానాలు ప్రయాణించేందుకు అనుమతించొద్దని కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర సర్కారు లేఖ రాసింది. జూలై 18, 26, 27 తేదీల్లో ఆలయానికి సంబంధించి నబకళేబర ఉత్సవాలు జరుగుతున్నందున్న ఆలయ భద్రత దృష్ట్యా ఆ ప్రాంతంలో గగన తల మార్గానికి అనుమతించకూడదని కోరారు.

ఈ మేరకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్, భువనేశ్ర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ డైరెక్టర్ బిజు పట్నాయక్ కు లేఖలు రాసింది. వాటి వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించింది. పూరీలోని జగన్నాథ ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైనది.

Advertisement
 
Advertisement
Advertisement