మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ | NITI Aayog meet: PM Modi to seek CMs' views on budget, infra development | Sakshi
Sakshi News home page

మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్

Feb 8 2015 12:33 PM | Updated on Oct 17 2018 6:01 PM

మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ - Sakshi

మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతను నీతి ఆయోగ్ తొలి సమావేశం ఆదివారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది.

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతను నీతి ఆయోగ్ తొలి సమావేశం ఆదివారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. పెట్టుబడులు, పొదుపు, అభివృద్ధి తదితర అంశాలపై ఈ  సందర్బంగా చర్చిస్తున్నారు. అలాగే ఈ ఫిబ్రవరి 28న కేంద్ర ప్రవేశ పెట్టనున్న ఆర్థిక బడ్జెట్ లో తీసుకురావాల్సిన అంశాలపై కూడా  ప్రధాని ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు.. ఉన్నతాధికారులు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ (భారత జాతీయ పరివర్తన సంస్థ)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement