52 కు చేరిన మేఘాలయ మృతులు | Meghalaya flood toll 52, waters recede a wk after calamity | Sakshi
Sakshi News home page

52 కు చేరిన మేఘాలయ మృతులు

Sep 29 2014 5:52 PM | Updated on Sep 2 2017 2:07 PM

మేఘాలయలోని గారోహిల్స్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లింది.

షిల్లాంగ్: మేఘాలయలోని గారోహిల్స్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు అధికమొత్తంలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఇప్పటివరకూ మేఘాలయాలో వరదల తాకిడికి 52 వరకూ మృతిచెందినట్లు డిప్యూటీ సీఎం రోయ్ త్రీ సీ లాలో తెలిపారు.  తమకు అధికారుల నుంచి అందిన లెక్కల ప్రకారం మరణించిన వారిలో అధిక శాతం మంది గారోహిల్స్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. ఈ వరదలతో రాష్ట్రంలో కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లందన్నారు. 

 

ఈ నష్టం విలువ రూ.2,000 కోట్ల వరకూ ఉంటుందని లాలో తెలిపారు. ప్రస్తుతం రెవెన్యూ బాధ్యతలు తీసుకున్న ఆయన పూర్తి నివేదిక వచ్చాక మాత్రమే ఎంత నష్టం సంభవించిందనేది తెలుస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో దెబ్బతిన్న మౌలిక సదుపాలయాల్ని తిరిగి పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నామన్నారు. గత వారం మేఘాలయాలో సంభవించిన భారీ వరదల్లో మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఇక్కట్ల పాలవ్వగా, దాదాపు 20 వేల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. గారోహిల్స్ ప్రాంతంలోని మూడు జిల్లాలపై ఎక్కువ ప్రభావం పడినట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement