మళ్లీ ఆమెకే పట్టం | Mamata Banerjee re-elected as Trinmool Congress chairperson | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆమెకే పట్టం

Apr 22 2017 8:55 AM | Updated on Sep 5 2017 9:26 AM

మళ్లీ ఆమెకే పట్టం

మళ్లీ ఆమెకే పట్టం

టీఎంసీ చైర్‌పర్సన్‌గా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ ఎన్నికయ్యారు.

తృణమూల్‌ చైర్‌పర్సన్‌గా మమత మరోసారి ఎన్నిక

కోల్‌కతా: ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీ(టీఎంసీ) చైర్‌పర్సన్‌గా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం మళ్లీ ఎన్నికయ్యారు. ఆమె ఈ పదవిలో ఆరేళ్లపాటు కొనసాగుతారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన సంస్థాగత ఎన్నికల అనంతరం ఆమె సమక్షంలో పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్‌రాయ్‌ ఈ విషయం వెల్లడించారు.

అనంతరం మమతా మాట్లాడుతూ తాను ఇతర పనుల్లో తీరిక లేకుండా ఉన్నందున ఈ బాధ్యతను వేరొకరికి అప్పగిస్తే బాగుండేదని అన్నారు. తాను కార్యకర్తగా ఉండేందుకే ఇష్టపడతానని, ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి సంపద వంటి వారని, నాయకులు కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement