యూఏఈలో భారత కార్మికుడొకరు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.
దుబాయ్: యూఏఈలో భారత కార్మికుడొకరు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. షార్జా పారిశ్రామిక ప్రాంతం నంబరు 17లో పనిచేస్తున్న 35 ఏళ్ల భారత కార్మికుడు సీలింగ్ కు ఉరేసుకుని చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంఘటనా స్థలంలో స్టూల్ గానీ, నిచ్చెన గానీ లేవు. దీంతో అతడు సీలింగ్ పైకి ఎలా చేరుకున్నాడనేది అనుమానంగా మారింది. మృతదేహాన్ని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.