విపత్తులకు భారత్, చైనా విలవిల | india and china suffering with Disasters | Sakshi
Sakshi News home page

విపత్తులకు భారత్, చైనా విలవిల

Nov 25 2015 2:48 AM | Updated on Sep 3 2017 12:57 PM

వాతావరణ సంబంధిత విపత్తుల కారణంగా భారత్, చైనా దేశాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయని ఐక్యరాజ్యసమితి

న్యూయార్క్: వాతావరణ సంబంధిత విపత్తుల కారణంగా భారత్, చైనా దేశాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి మంగళవారం వెల్లడించింది. 1995-2015 మధ్య కాలంలో సంభవించిన విపత్తుల వల్ల ఈ రెండు దేశాల్లో 3 బిలియన్ల మందికి పైగా ప్రభావితం చెందారని తెలిపింది. త్వరలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కీలక వాతావరణ సదస్సు జరగనున్న నేపథ్యంలో ప్రకృతి విపత్తులకు మానవ మూల్యం పేరిట యునెటైడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్(యూఎన్‌ఐఎస్‌డీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది.  

 నివేదికలోని మరిన్ని వివరాలు
► 1995-2015 మధ్య కాలంలో సంభవించిన విపత్తుల కారణంగా చైనాలో 2,274 మిలియన్ల మంది విపత్తుల ప్రభావానికి గురవగా, భారత్‌లో సుమారు 805 మిలియన్ల మంది ప్రభావితమయ్యారు.
► గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో 288 విపత్తులు సంభవించగా, అమెరికా(472), చైనా(441), ఫిలిప్పీన్స్(274), ఇండొనేసియా(163) చొప్పున సంభవించాయి.
► 6457 వరద ఘటనల వల్ల 90 శాతం అతి పెద్ద విపత్తులు సంభవించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement