కశ్మీర్ లో మళ్లీ చెలరేగిన తీవ్రవాదులు


పుల్వామా: జమ్మూకశ్మీర్ లో తీవ్రవాదులు మళ్లీ చెలరేగారు. పుల్వామా జిల్లాలో ఆదివారం సీఐఎస్ఎఫ్ క్యాంపుపై గ్రెనేడ్ తో దాడికి పాల్పడ్డారు. నూర్పోరా త్రాల్ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారు. ఈ ఘటనలో జవాన్ గాయపడ్డాడు. అతడిని శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు.



సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ లో పర్యటించనున్న నేపథ్యంలో తీవ్రవాదులు దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఈనెల 9న జమ్మూకాశ్మీర్ లో 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top