రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ
* బడ్జెట్ సమావేశాలే ప్రధాన ఎజెండా
* కొత్త మైనింగ్ విధానం సహా 25 అంశాలపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రభుత్వం పచ్చజెండా ఊపుతోంది. వీసీల నియామకం, ప్రైవేటు వర్సిటీలకు అనుమతి, ఒక మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వీలుగా ఏపీ ఉన్నత విద్యా చట్టం లో మార్పు లు చేస్తూ తెలంగాణకు అన్వయిం చుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్కు అనుగుణంగా అంచనాల్లో, పరిపాలనా అనుమతుల్లో మా ర్పులను వేగవంతం చేయనుంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని, 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం లో ఆదివారం కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు ప్రారంభించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలనే తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తొలిరోజున ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగ పాఠానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ ప్రవేశపెట్టే ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు.
నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్కు సంబంధించి కేబినెట్లో పలు సవరణలతో ఆమోదం పొందాల్సి ఉంది. మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల ప్రాజెక్టులకు రూ.5,813 కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ నిర్ణయానికి ఆమోదం పొందాల్సి ఉంది. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టుల రీడిజైనింగ్పైనా, మిడ్మానేరు నిర్వాసితులకు మరింత లబ్ధి చేకూరేలా పరిహారం ప్యాకేజీ చెల్లింపుల్లో మార్పులు చేర్పులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. నీటిపారుదల విభాగంలో సూపర్ న్యూమరీ పోస్టుల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)లను మరో ఏడాది పాటు కొనసాగించాలనే ప్రతిపాదనను ఎజెండాలో పొందుపరిచారు.
కొత్త మైనింగ్ విధానం
కొత్త మైనింగ్ విధానానికి కేబినెట్లో ఆమోద ముద్ర వేస్తారు. హమాలీ కుటుంబాల్లో పట్టభద్రులుగా ఉన్న మహిళలకు ప్రోత్సాహకం ఇచ్చే అంశం ఎజెండాలో ఉంది. ఆర్టీసీకి రూ.500 కోట్ల గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథకు నాబార్డు నుంచి రూ.1,900 కోట్ల రుణం, హడ్కో నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్సప్లై బోర్డుకు తీసుకునే రుణానికి ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఈ అంశాలను చర్చిస్తారు.
ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు
బీఆర్ఎస్, మున్సిపల్ ఎన్నికల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్లు తెచ్చింది. వాటిని చట్టంగా మార్చేందుకు అసెంబ్లీలో బిల్లులు పెట్టాలని నిర్ణయించింది. తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, మహబూబ్నగర్ జిల్లాలో ఫిషరీస్ ఎడ్యుకేషన్ అకాడమీ స్థాపన, బేగంపేట క్యాంపు ఆఫీసు సమీపంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్కు మూడెకరాల స్థలం కేటాయింపు, మెదక్ జిల్లాలోని ముచ్చర్ల సమీపంలో 50 ఎకరాలను టీఎస్ఐఐసీకి కేటాయింపు అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల మైనారిటీ విభాగంలో 20 రెగ్యులర్ పోస్టులు, 19 ఔట్ సోర్సింగ్ పోస్టులు, వైద్య ఆరోగ్య విభాగంలో 23 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి కేబినెట్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ప్రైవేటు యూనివర్సిటీలకు పచ్చజెండా!
Published Sat, Mar 5 2016 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement