పట్టాలు తప్పిన గూడ్స్ బోగీలు | goods train derails in kurla station | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్ బోగీలు

Aug 15 2013 7:37 PM | Updated on Sep 1 2017 9:51 PM

ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి ఓ గూడ్సు రైలుకు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.


ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి ఓ గూడ్సు రైలుకు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఎనిమిదో నెంబరు ప్లాట్ఫారం వద్ద జరిగిన ఈ సంఘటన ఫలితంగా హార్బర్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి, పట్టాలు తప్పిన గూడ్స్ బోగీలను అక్కడినుంచి తొలగించారు. ఇంజన్ నుంచి విడిపోయిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయిన రైల్వే వర్గాలు తెలిపాయి. దీంతో హార్బర్ మార్గంలో వెళ్లి, వచ్చే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని గంటల పాటు అవి పూర్తిగానిలిచిపోయాయి. దీనివల్ల ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement