బంగారం, వెండి ధరలు ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్ ముంబైలో మళ్లీ ఎగిశాయి.
ముంబై: బంగారం, వెండి ధరలు ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్ ముంబైలో మళ్లీ ఎగిశాయి. రికార్డు స్థాయి ధర నుంచి శుక్రవారం వెనక్కు తగ్గిన ధరలు తిరిగి శనివారం మళ్లీ కొంత ముందుకు ఉరికాయి. పూర్తి స్వచ్ఛత పసిడి ధర 10 గ్రాములకు రూ. 440 పెరిగి రూ. 32,120 వద్ద ముగిసింది. ఇక ఆభరణాల బంగారం రూ. 430 ఎగసి రూ. 31,950కి చేరింది. వరుసగా రూ.33,430, రూ.33,265 ఇక్కడ రికార్డు ధరలు. కాగా వెండి మాత్రం శనివారం స్వల్పంగా రూ. 85 పెరిగి రూ.55,110 వద్ద ముగిసింది.