ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ మధ్య పత్రికలపై విపరీతమైన కోపం వస్తోందట. తనకు అనుకూలంగా పుంఖానుపుంఖాలుగా నిత్యం వార్తలు వండే పత్రికలపైనే ఆయనకు కోపమొచ్చిందట. అదేంటి అంత అనుకూలంగా ఏర్చికూర్చి వార్తలు వండివార్చుతున్నా... బాబుగారికి ఎందుకు కోపమొస్తుందని ఇష్టమైన మీడియా ప్రతినిధులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందట. తనకు అనుకూలంగా వార్తలు రాస్తున్న పత్రికలు తన కుమారుడి విషయంలో అంత ప్రాధాన్యత ఇవ్వక పోవటమే ఆయన కోపానికి కారణమని తేలింది.
చంద్రబాబు కుమారుడు లోకేశ్ కార్యక్రమాలను పత్రికలు హైలైట్ చేయడం లేదని బాబు ఆగ్రహంతో ఉన్నారు. అదేంటి... బ్రహ్మాండంగా ప్రచారం కల్పిస్తున్నామే అని వాదిస్తున్న వారికి కూడా బాబుగారి నుంచి స్పష్టమైన సమాధానమే వచ్చిందట. తనకు ఇచ్చిన తరహాలోనే కుమారుడి కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యతతో మొదటి పేజీల్లో ఎందుకు ప్రచురించడంలేదని, లోపలి పేజీలకు పరిమితం చేస్తున్నారని, అదే బాబుగారి అసలు కోపానికి కారణమని సన్నిహితులు తేల్చారు. ఇంత చేస్తున్నా తన కుమారుడికి ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న విషయాన్ని పచ్చ పత్రికల పెద్దల ముందే అసంతృప్తిని వ్యక్తం చేశారట.
రాబోయే కాలంలో కాబోయే నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలని తాననుకుంటుంటే మీరు అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా ప్రశ్నించారు కూడా. మీరు ముఖ్యమంత్రి కాబట్టి ప్రాధాన్యత ఇస్తున్నారని, మీ కుమారుడు కాదుకదా...! అని ఒక సన్నిహితుడు అన్న పాపానికి బాబుగారు ఇంతెత్తున లేచారు. ఏవేవో పనికిరాని వార్తలు ఫస్ట్ పేజీలో ప్రచురిస్తుంటారు. మా వాడి వార్తలు వేయరా...!! అంటూ క్లాస్ తీసుకోవడంతో పాటు చినబాబుగారి బాధ్యతంతా ఇప్పుడు ఆ పత్రికలపైన వేశారట...!
ఫ్రంట్లో బొమ్మ పడాల్సిందే...!
Published Sun, Sep 13 2015 1:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement