లారీ- ట్రాక్టర్ ఢీ; నలుగురి మృతి | Four killed, six injured in road accident at Kurnool district | Sakshi
Sakshi News home page

లారీ- ట్రాక్టర్ ఢీ; నలుగురి మృతి

Apr 20 2015 7:09 PM | Updated on Sep 3 2017 12:35 AM

కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలం రాచర్ల సమీపంలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా

కర్నూలు( రాచర్ల): కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలం రాచర్ల సమీపంలో సోమవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలు అయినట్టు తెలిసింది. ఎదురుగా వస్తున్న లారీ ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.

అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డవారంతా బనగానపల్లె మండలానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement