విద్య, ఆరోగ్య సంరక్షణ తదితర సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభించనుంది.
న్యూఢిల్లీ: విద్య, ఆరోగ్య సంరక్షణ, తీర్థయాత్రలు తదితర సేవలకు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నుంచి మినహాయింపు లభించనుంది. ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉన్న సేవలను జీఎస్టీ అమలయ్యే తొలి ఏడాదిలో అలాగే కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్కు సిఫార్సు చేస్తామని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు.
కాగా, జీఎస్టీకి సంబంధించిన 8 రకాల నిబంధలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. జీఎస్టీలోని కంపొజిషన్, వాల్యుయేషన్, ట్రాన్సిషన్, ఐటీసీ, ఇన్వాయిస్, పేమెంట్స్, రీఫండ్, రిజిస్ట్రేషన్ అంశాలపై ఇండస్ట్రీ తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు.