తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళపై కేసు నమోదు | Court orders FIR against woman for filing false stalking case | Sakshi
Sakshi News home page

తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళపై కేసు నమోదు

Jul 4 2014 3:36 PM | Updated on Sep 2 2017 9:48 AM

ఓ వ్యక్తి తనను మోసగించాడంటూ కోర్టును ఆశ్రయించిన మహిళకు చుక్కెదురైంది.

న్యూఢిల్లీ: తన వద్ద బలవంతంగా డబ్బు గుంజేందుకు ఓ మహిళ తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నగర కోర్టు పోలీసులను ఆదేశించింది. ఢిల్లీకి చెందిన ఫార్మాసిస్టు నవీన్‌కుమార్ చేసిన ఫిర్యాదుపై చీఫ్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ సోను అగ్నిహోత్రి పై ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 30న రాత్రి ఓ మహిళ తనను భయపెట్టి తన వద్ద బంగారు గొలుసును, రూ.5వేల నగదును లాగేసుకుందని నవీన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత మరింత డబ్బు గుంజేందుకు తనపై తప్పుడు కేసు బనాయించిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు కల్యాణ్‌పురీ స్టేషన్ అధికారిని ఆదేశించింది.

 

ఆ మహిళ ఇప్పటికే అత్యాచారం, వేధింపులకు సంబంధించి వేర్వేరు వ్యక్తులపై పది కేసులు పెట్టిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా, నవీన్ చేసిన ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement