ఫోక్స్ వాగన్ స్కాంలో మళ్లీ కదలిక వచ్చింది. నాంపల్లి కోర్టులో ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.
ఫోక్స్ వాగన్ స్కాంలో మళ్లీ కదలిక వచ్చింది. నాంపల్లి కోర్టులో ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. దాంతో దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలని నిందితులను ఆదేశించింది.
నిందితులు డాక్టర్ హెల్మెట్ షూస్టర్, అశోక్ కుమార్ జైన్, జగదీశ్ అలగరాజా, గాయత్రీ చంద్రవదన్, బీకే చతుర్వేదిలతో పాటు.. వశిష్ట వాహన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు కూడా ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి.