ఢిల్లీ పీఠం కాంగ్రెస్ దే: రాహుల్ ధీమా | Congress will again win in Delhi: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పీఠం కాంగ్రెస్ దే: రాహుల్ ధీమా

Oct 27 2013 4:35 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఢిల్లీ పీఠం కాంగ్రెస్ దే: రాహుల్ ధీమా - Sakshi

ఢిల్లీ పీఠం కాంగ్రెస్ దే: రాహుల్ ధీమా

డిసెంబర్ 4 తేదిన జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

డిసెంబర్ 4 తేదిన జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాను అని రాహుల్ అన్నారు. 1998 నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను, అభివృద్ధిని రాజధానిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ వెల్లడించారు. ఢిల్లీలో అభివృద్ధి జరుగలేదని చెప్పడానికి ప్రతిపక్షాలకు కూడా అవకాశం లేదు అని అన్నారు.

యూపీఏ ప్రభుత్వం పథకం ఆహార భద్రత బిల్లుతోపాటు గత 15 ఏళ్లలో ఢిల్లీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని రాహుల్ తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చేసిన కృషిని రాహుల్ కొనియాడారు. ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇండోనేషియాతోపాటు విదేశాల్లో కూడా రోల్ మోడల్ గా మారింది అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement