'సర్ధార్ పటేల్ విగ్రహనికి గురువారం భూమి పూజ' | CM Narendra Modi to lay foundation stone of the world's tallest statue 'Statue of Unity' | Sakshi
Sakshi News home page

'సర్ధార్ పటేల్ విగ్రహనికి గురువారం భూమి పూజ'

Oct 29 2013 2:55 PM | Updated on Aug 15 2018 2:14 PM

ఉక్కుమనిషి సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహా ఏర్పాటుకు గుజరాత్ సీఎం నరేంద్రమోడీ గురువారం నర్మదా నదీ తీరంలో భూమి పూజ నిర్వహించనున్నారు.

భారత మొట్టమొదటి హోం శాఖ మంత్రి, ఉక్కుమనిషి సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహా ఏర్పాటుకు   గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గురువారం నర్మదా నదీ తీరంలో భూమి పూజ నిర్వహిస్తారని ఆ విగ్రహ కమిటీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు.

 

సర్థార్ పటేల్ 138వ జయంతి సందర్బంగా ఆ విగ్రహ ఏర్పాటుకు గుజరాత్ ప్రభుత్వం నడుంబిగించిందని తెలిపారు. ఆ విగ్రహనికి స్టాట్యు ఆఫ్ యూనిటీగా నామకరణం చేసినట్లు వివరించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టిస్తుందన్నారు.  దేశంలోని దాదాపు 7 లక్షల గ్రామాలకు చెందిన రైతులు ఆ విగ్రహం కోసం ఉక్కును విరాళంగా అందజేశారన్నారు. ఆ విగ్రహ ఏర్పాటులో అయా గ్రామల ప్రజల పాత్ర మరువలేనిదని డా. లక్ష్మణ్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement