ఆ నోట్లు చిత్తుకాగితాలే.. ప్రజలు ఏం చేయాలంటే? | All you need to know about 500, Rs 1000 notes scrapped | Sakshi
Sakshi News home page

ఆ నోట్లు చిత్తుకాగితాలే.. ప్రజలు ఏం చేయాలంటే?

Nov 8 2016 9:55 PM | Updated on Apr 3 2019 5:16 PM

ఆ నోట్లు చిత్తుకాగితాలే.. ప్రజలు ఏం చేయాలంటే? - Sakshi

ఆ నోట్లు చిత్తుకాగితాలే.. ప్రజలు ఏం చేయాలంటే?

ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. రూ. ఐదు వందలు, రూ. వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. రూ. ఐదు వందలు, రూ. వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నోట్లు కేవలం కాగితాలు మాత్రమే ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కరెన్సీ నోట్లు ఉన్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. ఈ నోట్లు కలిగిన ప్రజలు రానున్న రోజుల్లో ఏం చేయాలంటే..
 
  • బుధవారం (నవంబర్‌ 9) నాడు అన్ని బ్యాంకులు పనిచేయబోవు.
  • ప్రస్తుతం మీవద్ద  ఉన్న రూ. 500, రూ. వెయ్యినోట్లను డిసెంబర్‌ 30, 2016లోపు  బ్యాంకులు, పోస్టాఫీసులలో డిపాజిట్‌ చేయవచ్చు. ఇలా డిపాజిట్‌ చేసే నగదు విషయంలో ఎలాంటి పరిమితి లేదు.
  • ఈ నెల 24 వరకు హేడ్‌ పోస్టాఫీస్‌ లేదా సబ్‌ పోస్టాఫీస్‌లలో గుర్తింపు కార్డు చూపించి పాత రూ. 500, రూ. వెయ్యినోట్లను బదిలీ చేసుకోవచ్చు.  ఇక్కడ రూ. 4,000 పరిమితి ఉంటుంది.
  • ప్రస్తుతం బ్యాంకు నుంచి ఉపసంహరించే నగదు విషయంలో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 20వేలు వరకు పరిమితి ఉంటుంది. దీనిని రానున్న రోజుల్లో పెంచవచ్చు. 
  • చెక్కులు, డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల విషయంలో, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ విషయంలో ఎలాంటి పరిమితులు ఉండబోవు.

ఆ నోట్లు ఇక్కడ 72 గంటల వరకు చెల్లుతాయి!

  • అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రూ. 500, రూ. వెయ్యినోట్ల చెలామణి అవుతాయి
  • అదేవిధంగా రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, ఆర్టీసీ బస్సులు, విమాన బుకింగ్‌ కౌంటర్లు, పెట్రోల్‌ బంకులలో 72 గంటల వరకు ఇవి చెలామణి అవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement