ఇంకా లభించని 12 మంది నేవీ సిబ్బంది ఆచూకీ | 12 bodies yet to recover from submarine INS Sindhurakshak | Sakshi
Sakshi News home page

ఇంకా లభించని 12 మంది నేవీ సిబ్బంది ఆచూకీ

Aug 19 2013 4:17 AM | Updated on Apr 3 2019 5:44 PM

నగరంలోని డాక్‌యార్డ్‌లో ప్రమాదానికి గురైన ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో గల్లంతైన నేవీ సిబ్బందిలో మరో 12 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు.

 సాక్షి, ముంబై: నగరంలోని డాక్‌యార్డ్‌లో ప్రమాదానికి గురైన ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో గల్లంతైన నేవీ సిబ్బందిలో మరో 12 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. మంగళవారం అర్ధరాత్రి పేలుళ్లు జరిగి సింధురక్షక్ మునిగిపోవడం, అందులో 18 మంది నేవీ సిబ్బంది గల్లంతు కావడం తెలిసిం దే. గల్లంతైనవారిలో శనివారం నాటికి ఆరుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీశారు. మిగతా 12 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం జలాంతర్గామి మొదటి కంపార్ట్‌మెంట్ తలుపులు కూడా తెరిచి గజ ఈతగాళ్లు లోపలికి ప్రవేశించారని, కానీ మృతదేహాల జాడ తెలియలేదని ముంబైలో రక్ష ణ శాఖ పీఆర్‌వో నరేంద్రకుమార్ విస్‌పుతే ‘సాక్షి’కి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement