మహిళ దారుణ హత్య | Woman's brutal murder | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Jan 13 2015 2:29 AM | Updated on Mar 28 2018 11:05 AM

మహిళ దారుణ హత్య - Sakshi

మహిళ దారుణ హత్య

గుర్తుతెలియని మహిళ(35) దారుణ హత్యకు గురైంది. దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు.

శంషాబాద్ రూరల్: గుర్తుతెలియని మహిళ(35) దారుణ హత్యకు గురైంది. దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు. అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన మండల పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోశెట్టిగూడ శివారులో ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రహదారి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉంది.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు మహిళ తలపై బండరాయితో మోది హతమార్చారు. ఘటనా స్థలానికి సమీపంలో ఓ రాయి రక్తపు మరకలతో పడి ఉంది. మృతురాలి ముఖం గాయాలతో, రక్తంతో నిండి ఉంది. రక్తం నలుపురంగులోకి మారడంతో దుండగులు దాదాపు రెండు రోజుల క్రితం చంపేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి ముఖం నుజ్జునుజ్జయి గుర్తుపట్టకుండా తయారైంది. హతురాలికి సంబంధించిన ఆధారాలు లభించలేవు.

దుండగులు మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని, మృతురాలు స్థానికంగా ఇటుక బట్టీల్లో పని చేసే ఒడిశా కార్మికురాలు అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో రక్తం మరకలతో నీలిరంగు చారల టవల్ పడి ఉంది. మృతురాలి ఒంటిపై ఎర్రరంగు చారల చీర, నలుపు రంగు జాకెట్ ఉన్నాయి. హమీదుల్లానగర్ నుంచి తొండుపల్లి ఔటర్ జంక్షన్‌కు వచ్చే దారిలోని ఈ ప్రాంతంలో సర్వీసు దారి నిర్మాణం అసంపూర్తిగా ఉంది.

దీంతో ఇటువైపు వాహనాల రాకపోకలు లేకపోవడంతో నిర్మానుష్యంగా ఉంటుంది. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. జాగిలాలు ఘటనా స్థలం నుంచి సర్వీస్ రహదారి నుంచి పోశెట్టిగూడ వరకు వెళ్లి ఆగాయి. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకీ తరలించారు. మృతురాలి బంధువులు 08413-222033 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement