యువతిపై సామూహిక అత్యాచారం | woman gang raped in warangal | Sakshi
Sakshi News home page

యువతిపై సామూహిక అత్యాచారం

Mar 28 2015 7:24 PM | Updated on Aug 21 2018 5:46 PM

వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన ఓ యువతిపై శనివారం తెల్లవారుజామున నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

కాశీబుగ్గ : వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన ఓ యువతిపై శనివారం తెల్లవారుజామున నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ యువతిని స్థానికులు గుర్తించి ఇంతేజార్‌గంజ్ పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా బాలాజీనగర్‌కు చెందిన బైరిపాటి రాజ్‌కుమార్, దండం రవి, కడెం నర్సింహ, నారాయణ అనే నలుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడైంది.

కాగా వీరిలో ముగ్గురు యువకులు పరారీలో ఉండగా, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement