నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తాగునీటి సౌకర్యం లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరమ్మతులు చేయాలని ఆస్పత్రి అధికారులు కోరుతున్నా ఇంజినీరింగ్ అధికారులు స్పందించడం లేదు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు ఆస్పత్రిలోనే ఉండాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆదేశించినా ఫలితం లేకుండా పోతోంది. ఎండలు మండిపోతున్న త రుణంలో రోగులు, వారి సహాయకులు గుక్కె డు నీటి కోసం తల్లడిల్లుతున్నారు.
ఏడాదిగా ఇదే పరిస్థితి
మెడికల్ కళాశాల ఏర్పాటు తరువాత జిల్లా ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మారుస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఏడంతస్తుల అధునాతన భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను విడుదల చేసింది. కొత్త ఆస్పత్రి కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి పనుల కు అనుమతులు ఇచ్చారు. కానీ ఇక్కడి అధికారులు మాత్రం నామమాత్రపు ప నులు చేసి చేతులు దులుపుకున్నారు. ప్ర స్తుతం ఇక్కడ తాగునీటి సౌకర్యం లేదు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలకు నీటిని అం దించేందుకు 12 నీటి బోరు ఉండాలి.
కానీ, రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా రోగులకు నీటిని అందించే వీలులేకుండా ఉన్నాయి. అన్ని విభాగాల లో నల్లాలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో నే కొన్ని చోట్ల నల్లాలు చోరీకి గురయ్యూరుు. పైపులనూ ఎత్తు కెళ్లారు. వాటిని మరమ్మత్తు చేసి వినియోగం లోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీం తో రోగులు బయట నీళ్లు కొనుగోలు చేసుకుంటున్నారు.
సీసీ కెమెరాలు ఎక్కడ?
ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నా, అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రతి అంతస్తులో చాలాన్గేటు ఏర్పాటు చేయూలి. ఇది కూడా అ తీగతీ లేదు. 76 ఏసీలు ఉంటే 9 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వీటిని మరమ్మత్తులు చేయించాలని అధికారులు కోరుతున్నా ఇంజినీరింగ్ విభాగం పట్టించుకోవడ ం లేదు. అత్యవసర విభాగంలో గదులను విస్తరించాల్సి ఉంది. రెండు సింకులు ఏర్పాటు చేయూలి. మొదటి అంతస్తు నుండి ఏడవ అంతస్తు వరకు వివిధ విభాగాలను గుర్తించేందుకు ప్రతి గదికి నంబర్ వేయూలి.
భవనం అప్పగించే ముందు ఇంజినీరింగ్ అధికారులే నంబరింగ్ వేయూలి. పట్టించుకునే నాథు డు లేడు. ప్రవేశమార్గం, అ త్యవసర విభాగం వద్ద ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పేరిట నేమ్బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించినా మార్పులేదు. డ్రెరుునేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం తో మార్పులు చేయూలని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన అనుమతించినా పనులకు మోక్షం లేదు.
నీటిపైపులు, టాయిలెట్ పైపులు పగిలి మురికినీరు ప్రవహిస్తోంది. రూ.12 కోట్ల రూపాయలు మరమ్మత్తుల కోసం ఖర్చు చేస్తున్నామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.పనులు మాత్రం జరుగ డం లేదు. ఆపరేషన్ గదులలో ఏసీలు పని చేయడం లేదు. ఆస్పత్రి ముందు భాగంలో గార్డెన్ ఏర్పాటు చేయాలని భవన నిర్మాణంలోనే అధికారులు ప్రణాళికలో చేర్చా రు. ఏడాది గడుస్తున్నా దాని జాడ లేదు.
దవాఖానాలో దాహం
Published Sun, Apr 5 2015 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాక్షస పరివార్..
లెజెండ్రీ నటుడికి నివాళిగా.. నబా నటేష్ ఇలా మారిపోయింది! (ఫోటోలు)
బీజేపీ ‘ప్యూన్’ వ్యాఖ్యలు.. స్పందించిన అమేథీ అభ్యర్థి
అత్యధిక మిలియనీర్స్ ఉన్న భారతీయ నగరం ఇదే..!
కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్
SRH: సన్రైజర్స్ గుండెల్లో గుబులు.. మ్యాచ్ గనుక రద్దైతే!
కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..
ఎంతైనా జ్యోతిక... ఆ స్టయిలే వేరు! (ఫొటోలు)
అందరూ పోలింగ్లో పాల్గొనాలి: అదానీ
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement