తల్లి వీల్ఛైర్కోసం ఓ మహిళ ఆస్పత్రి సిబ్బంది వద్ద సెల్ఫోన్ తాకట్టు
ఆంధ్రప్రదేశ్: అనంతంపురం జిల్లా ప్రభుత్వ అస్పత్రిలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. తన తల్లిని అడ్మిట్ చేసిన ఓ మహిళపై ఆస్పత్రి సిబ్బంది కర్కషంగా ప్రవర్తించింది. తల్లి వీల్ఛైర్కోసం సదరు మహిళ ఆస్పత్రి సిబ్బంది వద్ద సెల్ఫోన్ తాకట్టు పెట్టాల్సిన వాతావరణం నెలకొంది. ఇదేంటని నిలదీసిన బంధువుల వద్దనుంచి కూడా సెల్ఫోన్ లాక్కున్నట్లుగా మహిళ బంధువులు తెలిపారు. అంతేకాకుండా వారివద్దనుండి డబ్బులు వసూలు చేసినట్టుగా బాధితులు వాపోయారు.


