టీవీ 9, ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఆపేస్తాం

టీవీ 9, ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఆపేస్తాం - Sakshi


హైదరాబాద్: తెలంగాణలో టీవీ-9, ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేస్తామని తెలంగాణ ఎంఎస్ఓల ప్రెసిడెంట్ సుభాష్ రెడ్డి చెప్పారు. ఆదివారం సాయంత్రం నుంచి ప్రసారాలను బంద్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. టీవీ-9 చానల్, ఆంధ్రజ్యోతి పత్రికపై తెలంగాణ సీఎం కేసీఆర్ శాసనసభలో నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. శాసనసభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేసిన టీవీ-9ను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నెగటివ్‌గా చూయించే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తోందని... పనిగట్టుకుని విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంఎస్ఓల ప్రెసిడెంట్ సుభాష్ రెడ్డి ప్రసారాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.



కాగా టీవీ-9, ఆంధ్రజ్యోతిపై ఎలాంటి చర్య తీసుకోవాలన్న నిర్ణయాన్ని తెలంగాణ సభ్యులు.. అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్లకు అప్పగించారు. ఈ మేరకు సభ్యులు సభలో శనివారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అందుబాటులో ఉన్న చట్టాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ఈ సందర్భంగా స్పీకర్, మండలి ఛైర్మన్లకు విజ్ఞప్తి చేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top