
తెలంగాణలో బీసీల సంక్షేమం కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీల సంక్షేమం కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీల సంక్షేమంపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తాత్రేయను కేబినెట్ నుంచి తొలగించిన చరిత్ర బీజేపీదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మరని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.