పంజగుట్ట కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్లింపులు | Traffic Diversion Panjagutta Burial Ground Road Works | Sakshi
Sakshi News home page

పంజగుట్ట కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్లింపులు

Mar 14 2020 10:44 AM | Updated on Mar 14 2020 10:47 AM

Traffic Diversion Panjagutta Burial Ground Road Works - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పంజగుట్ట శ్మశానవాటిక వద్ద రోడ్డు విస్తరణ, స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లింపులు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం ప్రకటించారు. ఇవి శనివారం నుంచి ఈ ఏడాది జూన్‌ 3 వరకు అమలులో ఉంటాయన్నారు. ఎస్‌ఎన్‌టీ జంక్షన్‌ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్, పంజగుట్ట చౌరస్తాల వైపు ఏ భారీ వాహనాలను అనుమతించరు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్‌ జంక్షన్, రోడ్‌ నెం.45 జంక్షన్, రోడ్‌ నెం.36 వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌–యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌–మైత్రీవనం మీదుగా లేదా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌–రోడ్‌ నెం.45–బీవీబీ జంక్షన్‌– రోడ్‌ నెం.12 మీదుగా ప్రయాణించాలని ఆయన సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement