పెద్దాపూర్ వద్ద కారు - ఆటో ఢీకొనడంతో ఘటన
పోతిరెడ్డిపల్లిలో విషాద ఛాయలు
పది నిమిషాలైతే గూటికి చేరేవారు
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
పోతిరెడ్డిపల్లిలో విషాదఛాయలు
సంగారెడ్డి క్రైం : అంత్యక్రియలకు వెళ్తున్న వారికి అదే అంతిమయాత్ర అవుతుందనుకోలేదు వారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకున్న వారిని కారు మృత్యువు రూపంలో వచ్చి కబళించింది. సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కదిలించి వేసింది. బంధువు చివరి చూపు కోసం వెళ్లిన వారికి అదే చివరి రోజైంది.
సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేకిందర్ సావిత్రి (60) కుటుంబానికి చెందిన ఒకరు మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం మాదారంలో చనిపోగా అతడి అంత్యక్రియలకు రేకిందర్ సావిత్రమ్మ, ఆమె కుమారుడు రేకిందర్ జనార్దన్, రెండో కుమారుడు కోటయ్య భార్య సుజాతలతో పాటు మరో నలుగురు ఆటోలో బుధవారం ఉదయం బయలుదేరారు. కార్యక్రమం పూర్తిచేసుకుని సాయంత్రం వారు సంగారెడ్డికి తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం తెల్లవారుజామున సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద కారు ఢీకొనగా సావిత్రి, జనార్దన్, సుజాతలు మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్తో సహా మరో నలుగురు గాయపడ్డారు.
కాగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో పోతిరెడ్డిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూలీ నాలి చేసుకుని జీవనం సాగించే వారు మృత్యువాత పడడంతో గ్రామంలోని వీకర్ సెక్షన్ కాలనీవాసులంతా కన్నీరు పెట్టారు. మృతుడు జనార్దన్కు భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అనాథలైన పిల్లలు : రోడ్డు ప్రమాదంలో సుజాత మృతి చెందగా ఆమె భర్త కోటయ్య గత కొన్ని నెలల క్రితం ఆత్యహత్యకు పాల్పడ్డాడు. దీంతో వీరి పిల్లలు సాయి, శ్రీకాంత్, శ్రుతిలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. కొన్ని నెలల క్రితం తండ్రి కోటయ్యను కోల్పోయిన పిల్లలు తాజాగా తల్లి కూడా మరణించిందన్న విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించసాగారు. పిల్లల రోదనలు ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్దలంతా మృత్యువాత పడడంతో ఆ కుటుంబమంతా రోడ్డున పడింది.
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ...ముగ్గురి మృత్యువాత
Published Fri, May 8 2015 12:39 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
‘ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గల్లంతే!’
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
తప్పక చదవండి
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement