మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది జైలు నుంచి బుధవారం మధ్యాహ్నం ఒక ఖైదీ తప్పించుకు పోయాడు.
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది జైలు నుంచి బుధవారం మధ్యాహ్నం ఒక ఖైదీ తప్పించుకు పోయాడు. తూప్రాన్ మండలం గున్రెడ్డిపల్లికి చెందిన యాదగిరి ఒక కేసులో కంది జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం అధికారులు ఖైదీలను తోటపని చేయిస్తున్న సమయంలో యాదగిరి అదును చూసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.