చెరువులో పడి బాలుడి మృతి | The boy fell into the pond dies | Sakshi
Sakshi News home page

చెరువులో పడి బాలుడి మృతి

Jan 29 2016 4:18 PM | Updated on Apr 3 2019 7:53 PM

చెరువు వద్దకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడి మృతిచెందాడు.

చెరువు వద్దకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంగ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యోగి(12) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈరోజు చెరువు వద్దకు వెళ్లి కాలుజారి అందులో పడి మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement