బస్సుబోల్తా...పది మందికి గాయాలు | Ten injured bus accident | Sakshi
Sakshi News home page

బస్సుబోల్తా...పది మందికి గాయాలు

Jun 25 2016 4:30 PM | Updated on Apr 3 2019 7:53 PM

బస్సు పల్టీకొట్టిన ఘటనలో పదిమంది గాయాల పాలయ్యారు. శనివారం సాయంత్రం నర్సాపూర్-తుప్రాన్ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నర్సాపూర్‌(మెదక్): బస్సు పల్టీకొట్టిన ఘటనలో పదిమంది గాయాల పాలయ్యారు. శనివారం సాయంత్రం నర్సాపూర్-తుప్రాన్ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సంగారెడ్డికి వెళుతుండగా.. హన్మంతాపూర్ సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మందిలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement