శివునిపల్లి(స్టేషన్ఘన్పూర్ టౌన్) : పెద్దలు, కుటుంబ సభ్యుల మాటను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుంటుందని అనుకోలేదని ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యూరు. నమ్మించి.. మట్టుబెట్టిందని శాపనార్థాలు పెట్టారు. శివునిపల్లికి చెందిన కుసుమ సత్తెమ్మ, రాజమౌళి దంపతుల కుమారుడు శ్రావణ్కుమార్(33) హైదరాబాద్లో ఈ 9న భార్య చేతిలో హత్యకు గురయ్యూడు.
అతడి మృతదేహాన్ని సోమవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడి తల్లిదండ్రులు, సోదరుడి కథనం ప్రకారం.. శ్రావణ్కుమార్ సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన అమృత నర్సింహారావు, విజయ దంపతుల కుమార్తె పావనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో బీటేక్ ఫైనలియర్ చదువుతున్న అతడిని తల్లిదండ్రులు ఎంటెక్ చదివించారు.
అనంతరం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ భార్యతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. వారికి కుమారుడు అభినవ్, కుమార్తె వశిష్ట ఉన్నారు. హైదరాబాద్ వనస్థలిపురం బాలాజీనగర్లో బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకోవడంతోపాటు ఫైనాన్స్లో కారు కొనుగోలు చేశారు. కాగా ఏడాది క్రితం అతడిని కళాశాల యూజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారడంతోపాటు ఏడు నెలల క్రితం దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనోవేదనకు గురైన శ్రావణ్కుమార్ తన పిల్లలను తీసుకుని శివునిపల్లిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. మూడు నెలల క్రితం పిల్లలు కావాలని ఇంటికి వచ్చిన భార్య పావని పాపను తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లింది.
పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచారుుతీలు కాగా ఇద్దరు కలిసి శివునిపల్లిలో ఉండాలని వారు నిర్ణరుుంచారు. అందుకు పావని అంగీకరించలేదు. దీంతో అతడు ధర్మసాగర్ మండలం రాంపూర్ వీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. కుమారుడిని ఘన్పూర్లోని హోలీక్రాస్ పాఠశాలలో చేర్పించి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలోనే పావని హైదరాబాద్లోని పోలీస్స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత దీపావళి పండుగ మరుసటి రోజు ఇంటికి వచ్చిన పావని తాను మారిపోయానని, అంతా కలిసి ఉందామని చెప్పడంతో శ్రావణ్కుమార్ నమ్మాడని తల్లిదండ్రులు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వేములవాడకు వెళ్లొచ్చారని, హైదరాబాద్లో ఉన్న ఇంటిని అమ్మేందుకని ఈ నెల 8న హైదరాబాద్కు వెళ్లిన కొడుకు తిరిగిరాలేదని వారు విలపించారు. ఈ నెల 9న రాత్రి హైదరాబాద్ నుంచి పోలీసులు ఫోన్ చేసి శ్రావణ్ చనిపోయినట్లు చెప్పారని వాపోయూరు. శ్రావణ్ను భార్య, అత్త పథకం ప్రకారం హతమార్చారని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
కట్టుకున్న భార్యే.. పొట్టన బెట్టుకుంటుందనుకోలే..
Published Wed, Nov 12 2014 2:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement