జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం!

Sangareddy Collector Gives Financial Aid For The Sakshi Journalist Family

సాక్షి, సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో మరణించిన ‘సాక్షి’ క్రైం రిపోర్టర్‌ బ్యాగరి నర్సింహులు కుటుంబ సభ్యులకు కలెక్టరేట్‌ ఆవరణలో సంగారెడ్డి వర్కింగ్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ తరపున రూ.10 వేలు, కలెక్టర్‌ ఎం.హన్మంతరావు తన వంతుగా రూ.5 వేలు శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. జర్నలిస్టు అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.సాయినాథ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి డేవిడ్‌ రాజ్, సంతోష్, నాగభూషణం, రమేష్, రఘునందన్, డీపీఆర్‌ఓ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top