గుండెపోటుతో ‘సాక్షి’ విలేకరి మృతి | Sakshi reporter died | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ‘సాక్షి’ విలేకరి మృతి

Apr 27 2018 12:16 AM | Updated on Sep 28 2018 3:39 PM

Sakshi reporter died

వనపర్తి అర్బన్‌: వనపర్తి జిల్లా గోపాల్‌పేట ‘సాక్షి’ దినపత్రిక రిపోర్టర్‌ యాసిన్‌(38) హఠాన్మరణం చెందారు. యాసిన్‌ స్వస్థలం గోపాల్‌పేట మండ లం పొల్కెపాడు కాగా, వనపర్తిలోనే నివాసముంటున్నారు. బుధవారం సాయంత్రం ఆయన భార్యాపిల్లలతో కలసి అత్తగారి ఊరైన పెద్దమం దడి మండలంలోని పామిరెడ్డిపల్లెకు వెళ్లారు. గురువారం ఉదయం 5 గంటలకు ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పాడు.

దీంతో వారు వనపర్తి ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పొల్కెపాడుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. యాసిన్‌ కు భార్యతోపాటు ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. సాక్షి ఉద్యోగులు, విలేకరులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించడంతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. ‘సాక్షి’ తరఫున తక్షణ సాయంగా రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement