లోకో పైలెట్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు | Rescue operation ends in Kacheguda Railway station in Hyderabad | Sakshi
Sakshi News home page

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌

Nov 11 2019 7:02 PM | Updated on Nov 11 2019 7:03 PM

Rescue operation ends in Kacheguda Railway station in Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సుమారు ఎని​మిది గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌ ఎట్టకేలకు ముగిసింది. రైలు ఇంజిన్‌లో ఇరుక్కొన్న లోకో పైలెట్‌ శేఖర్‌ను ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది బయటకు తీశారు.  గ్యాస్‌ కట్టర్ల సాయంతో ఇంజిన్‌ భాగాలను తొలగించి లోకో పైలెట్‌ను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కాచిగూడ రైల్వేస్టేషన్‌లో  ఆగి వున్న కర్నూలు-హైదరాబాద్‌ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను...అదే ట్రాక్‌ వచ్చిన ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 30 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.  సిగ్నల్‌ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్‌లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్‌ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. 




చదవండి: కాచిగూడ : ఆగివున్న ట్రైన్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్‌

Advertisement
 
Advertisement
Advertisement