ఫిట్స్‌తో ఖైదీ మృతి | prisoner Died with fits | Sakshi
Sakshi News home page

ఫిట్స్‌తో ఖైదీ మృతి

Sep 27 2015 12:59 PM | Updated on Oct 16 2018 3:12 PM

సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ లింగయ్య(40) అనే ఖైదీ ఆదివారం మృతిచెందాడు.

సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ లింగయ్య(40) అనే ఖైదీ ఆదివారం మృతిచెందాడు. అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న లింగయ్య శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఫిట్స్ రావడంతో జైలు అధికారులు హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరణించాడు. తూప్రాన్ మండలం పోతరాజ్‌ పల్లి గ్రామానికి చెందిన లింగయ్య నాలుగో పెళ్లి చేసుకోవడంతో గత ఆగస్టులో రెండో భార్య తూప్రాన్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసింది. పోలీసులు లింగయ్యపై నిర్భయ కేసు నమోదు చేసి జిల్లా జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలులోనే అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement