కోడి పందేలు.. ఏడుగురి అరెస్టు
చెన్నూర్: కోడి పందేల స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్మండలం వెంకంపేట గ్రామంలో చోటుచేసుకుది. పందెం కాస్తోన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదు కోళ్లు, రూ. 2500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చెన్నూర్ పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.