రుణమాఫీపై పార్లమెంటు ముట్టడి | PI(M) leader Sitaram Yechury hints 'gherao' Parliament | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై పార్లమెంటు ముట్టడి

Apr 2 2017 2:03 AM | Updated on Sep 5 2017 7:41 AM

రుణమాఫీపై పార్లమెంటు ముట్టడి

రుణమాఫీపై పార్లమెంటు ముట్టడి

రైతు రుణమాఫీ అంశంపై వచ్చే వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటును ముట్టడిస్తామని లేదా భారీ ప్రదర్శన చేపడతామని సీపీఎం ప్రధాన కార్య దర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు.

సీతారాం ఏచూరి వెల్లడి
కేంద్రం కార్పొరేట్‌ రుణాలు మాఫీ చేస్తూ రైతు రుణమాఫీని పట్టించుకోదా?


సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీ అంశంపై వచ్చే వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటును ముట్టడిస్తామని లేదా భారీ ప్రదర్శన చేపడతామని సీపీఎం ప్రధాన కార్య దర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. అన్ని ప్రజాసంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ప్రజానిరసన నిర్వహిస్తామన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాఉద్యమాలు, నిరసనల ద్వారానే మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ విధానాల నుంచి వెనక్కు తగ్గేలా ఒత్తిడి తేవడం సాధ్యమన్నారు. కార్పొ రేట్‌ సంస్థలు, ధనికుల రుణాలను పెద్దఎత్తు న మాఫీ చేస్తున్న మోదీ ప్రభుత్వం దేశవ్యా ప్తంగా రైతు రుణాలపై నోరు మెదపకపోవడం దారుణమన్నారు. దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో వ్యవసాయరంగ సంక్షోభం ము దురుతోందని, రైతు ఆత్మహత్యల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు.

మతోన్మాద విధానాలపై ఐక్య పోరు...
మతోన్మాద విధానాల ద్వారా దేశంలో మతప రమైన విభజనకు బీజేపీ చేస్తున్న ప్రయత్నా లను ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్యశక్తులు కలసి రావాల్సిన అవసరం ఉందని ఏచూరి తెలిపారు. ఇది రాజకీయ స్థాయిలో కాకుండా పోరా టాల ద్వారా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఒక ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకురా వాలన్నది తమ ఆలోచనన్నారు. పార్లమెంటు లో బీజేపీ ప్రమాదకర ధోరణిని అనుసరిస్తోం దని, ఆర్థిక బిల్లులకు సవరణల ద్వారా పార్ల మెంటరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగి స్తోందని అన్నారు. పార్లమెంటు సంప్రదా యాలను కాదని ఆర్థిక బిల్లుకు ఐదు సవరణ లు చేసి దాన్ని ద్రవ్య బిల్లుగా చూపడం దారుణమని విమర్శించారు.

రాజకీయ అవినీతికి రాచబాట...
రాజకీయాల్లో డబ్బు ప్రభావాన్ని నియంత్రించాలంటూ ఉపన్యాసాలిచ్చిన మోదీ.. పార్లమెంటులో అందుకు విరుద్ధంగా వ్యవహరిం చారన్నారు. ఆర్థిక బిల్లులో కంపెనీ చట్టాన్ని సవరించి కార్పొరేట్‌ సంస్థల నుంచిరాజకీయ పార్టీల విరాళాలకు పరిమితిని ఎత్తేయడం ద్వారా ఏ పార్టీకి ఏ కంపెనీ ఎంత విరాళాలిచ్చిందో, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సిన అవసరం లేకుండా చేశారన్నారు. ఇది రాజకీయ అవినీతినిపెంచుతుందన్నారు. ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందేందుకు ఎంతగానో ప్రయత్నించి మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement