శంషాబాద్ ఎయిర్పోర్టు రహదారిలోని కిషన్గూడ సమీపంలో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టు రహదారిలోని కిషన్గూడ సమీపంలో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.